AP CM YS Jagan

Chandrababu Naidu: ఆ 70మందిని టార్గెట్‌ చేసిన టీడీపీ.. టీడీపీ విజయాన్ని ఆపడం కష్టమేనా ?

Chandrababu Naidu: ఆ 70మందిని టార్గెట్‌ చేసిన టీడీపీ.. టీడీపీ విజయాన్ని ఆపడం కష్టమేనా ?

ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది ఏపీ రాజకీయం. ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో.. ఏ విషయం వివాదంగా మారి రాజకీయాన్ని మలుపు తిప్పుతుందో అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సీన్ మరింత మారింది. వివేకా కేసులో వైఎస్‌ కుటుంబం చుట్టూ అల్లుకుంటున్న ఉచ్చు.. పాలిటిక్స్‌ను మరింత హీటెక్కించాయి. వైసీపీ సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ మాత్రం ఫుల్‌ జోష్‌లో కనిపిస్తోంది. పక్కా క్లారిటీతో అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఫలితాలు, పవన్‌తో చంద్రబాబు మీటింగ్‌.. ఇలాంటి పరిణామాలన్నీ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి.