Actress Anasuya : ఫ్యాన్స్ కి గుండె బద్దలయ్యే న్యూస్.. కఠినమైన నిర్ణయం తీసుకున్న యాంకర్ అనసూయ
అనసూయ ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది. లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. కానీ కొన్ని సార్లు అనసూయను విమర్శించే వాళ్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. ఈ పోస్ట్ చూస్తే ఎవరో అనసూయను బాగా హర్ట్ చేసినట్లు తెలుస్తోంది. తన మర్యాదకు భంగం కలిగించినట్లు తనను ఎవరో బాగా బాధపెట్టినట్లు అర్థం అవుతోంది. దీంతో ఇకపై వాళ్లను ఎట్టి పరిస్థితిలోను కలిసేది లేదంటోంది. ‘‘ఎడబాటే అగౌరవానికి నా సమాధానం. ఇక నేను స్పందించను, ఎవరితో వాదనకు దిగను, నటించను, సింపుల్గా కలవడం మానేస్తా అంతే’’ అంటూ పోస్టులో రాసుకొచ్చింది.