Delhi: కేజ్రీవాల్ పిలుపుతో కదంతొక్కిన ఢిల్లీ నగరవాసులు
ఢిల్లీ ముఖ్యమంత్రి పిలుపు మేరకు నగరవాసులు కదలివచ్చారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేతిలో అధికారాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వ పాలనకు విఘాతం కలుగుతోందన్నారు. దీనికి ప్రజామద్దతు అవసరం అని కోరారు. బీజేపీని ఓడించాలంటే లోక్ తంత్రాన్ని ఉపయోగించాలని ప్రజలను కోరారు. ర్యాలీ అనంతరం భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు.