Diabetes: బాబోయ్..! దేశంలో ఎంతమంది షుగర్ పేషెంట్లు ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారు! మైండ్ పోయే విషయాలు బయటపెట్టిన ఐసీఎంఆర్
ప్రస్తుతం మన దేశంలో మధుమేహుల సంఖ్య 10 కోట్ల మార్కును దాటింది. 2019లో 7 కోట్లుగా ఉన్న ఆ సంఖ్య కేవలం నాలుగేళ్లులో 44 శాతం పెరిగింది. గోవా (26.4శాతం), పుదుచ్చేరి (26.3శాతం), కేరళ (25.5శాతం) మొదటి మూడు స్థానల్లో ఉన్నాయి. జాతీయ సగటు 11.4 శాతంగా ఉంది.