Former Janasena Leader

JD Lakshmi Narayana: దూకుడు పెంచిన జేడీ లక్ష్మీనారాయణ.. విశాఖలో పాగా వేయడం ఖాయమా ?

JD Lakshmi Narayana: దూకుడు పెంచిన జేడీ లక్ష్మీనారాయణ.. విశాఖలో పాగా వేయడం ఖాయమా ?

గత ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన నుంచి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. కారణాలు ఏవైనా ఆ తర్వాత గ్లాస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సింగం సింగిల్ అనే రేంజ్‌లో ఒంటరిగానే పోరాడుతా.. ఒంటరిగానే పోరులో నిలబడతా అంటూ.. ఎన్నికలయుద్ధానికి సిద్ధం అవుతున్నారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ.. ఇలా పార్టీల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నా.. పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు ఆయన ! ఓట్ల ప్రకారమే తాను విశాఖలో ఓడిపోయానని.. జనాల నమ్మకం, ప్రేమ గెలుచుకోవడం సక్సెస్ అయ్యానని అంటున్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధం అవుతున్నారు.