Amarnath Yatra : ఈనెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర షూరు.. భారీ భద్రత కల్పించనున్న BRO
అమర్ నాధ్ యాత్ర అనంత్నాగ్ జిల్లా పహల్గామ్ ట్రాక్, గందర్బల్ జిల్లాలోని బల్తాల్ మార్గాల్లో ఒకేసారి ప్రారంభంకానున్నది. ఈసారి యాత్రకు భారీగా భద్రతను కల్పించనున్నారు. అమర్ నాథ్ యాత్రికుల కోసం శ్రీఅమర్నాథ్ క్షేత్ర బోర్డు, జమ్మూ కశ్మీరు పాలనా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతేడాది 4.5 లక్షల మందికిపైగా భక్తులు అమర్నాథ్ గుహను సందర్శించారు.