Nitish Kumar: బిహార్పై కన్నేసిన బీజేపీ.. జేడీయూను చీలుస్తారా..? మరో మహారాష్ట్ర అవుతుందా..?
మహారాష్ట్రలో గత ఏడాది శివసేను చీల్చి, తిరుగుబాటు ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు. తాజాగా అదే రాష్ట్రానికి చెందిన ఎన్సీపీని చీల్చి, తిరుగుబాటు నేత అజిత్ పవార్ను డిప్యూటీ సీఎంను చేసింది. ఇదే తరహా ప్లాన్ను ఇప్పుడు బిహార్లోనూ అమలు చేస్తోందని విశ్లేషకుల అంచనా.