Anju Yadav: సీఐ అంజూ యాదవ్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వబోతోందా ?
జనసేన కార్యకర్తపై.. శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్న ఘటన.. ఇప్పుడు రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ఓ కార్యకర్తకు ఎదురైన అనుభవంపై.. పార్టీ అధినేతే రియాక్ట్ అయ్యారు. పవన్ కల్యాణ్ తిరుపతి వెళ్లి.. అంజూ యాదవ్ మీద ఫిర్యాదు చేశారు. కార్యకర్త మీద చేయి చేసుకోవడం అంటే.. ప్రాథమిక హక్కులను భంగం కలిగించినట్లే అని పవన్ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంలో మంటలు రేపుతున్నాయ్.