AP Srikakulam Politics : సిక్కోలు సీటుపై వైసీపీ కన్ను… తిలక్ తో రామ్మోహన్ కి చెక్ !
శ్రీకాకుళం (Srikakulam) లోక్ సభ (Lok Sabha ) సీటును వరుసగా గెలుచుకుంటోంది టీడీపీ(TDP) . తమకు కొరకరాని కొయ్యగా మారిన ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం రకరకాల ఈక్వేషన్స్ లో పేర్లను పరిశీలించింది వైసీపీ (YCP) అధినాయకత్వం. అంగ బలం, ఆర్థిక బలం ఉన్న చాలా మంది నేతల పేర్లు పరిశీలనకు వచ్చాయట. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ లేదా మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుల్లో ఒకరిని బరిలో దింపాలని కూడా అనుకుందట.