2024, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు గోల్డెన్ ఇయర్
2024 లో క్రికెట్ అభిమానులకు ఒకరకంగా పండగ వాతావరణం అని చెప్పాలి. గత ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ప్రపంచ కప్ అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓడిపోయిన భారత జట్టు కరేబియన్ దీవులలో జరిగిన టి20 వరల్డ్ కప్ గెలిచేసి సంచలనాలు సృష్టించింది. సౌత్ ఆఫ్రికా పై తక్కువ స్కోరు చేసినా… భారత్ వ్యూహాత్మకంగా విజయం సాధించి రెండోసారి టి20 ప్రపంచకప్ అందుకుంది.