Jr NTR, Earthquake : జపాన్ నుంచి క్షేమంగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్
హమ్మయ్య.. జూనియర్ ఎన్టీఆర్ జపాన్ నుంచి క్షేమంగా ఇండియాకి తిరిగి వచ్చాడు. జపాన్ లో సోమవారం నాడు భారీ భూకంపం రాగా.. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అయితే ఇదే టైమ్ లో ఫ్యామిలీ ట్రిప్ కోసం జూనియర్ ఎన్టీఆర్ జపాన్ కి వెళ్ళడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళన చెందారు. అయితే తాను క్షేమంగా ఇండియాకు తిరిగి వచ్చినట్టు X వేదికగా తారక్ ట్వీట్ చేయడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.