Andhra Pradesh : షర్మిల వైసీపీకి శత్రువే..! ఆ మంత్రి చెప్పేశాడుగా !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇకపై తన చెల్లెలు షర్మిలను శత్రువుగానే చూడబోతున్నారా ? షర్మిల కాంగ్రెస్ లో చేరారు… రేపో, మాపో ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు కూడా అవుతారని అంటున్నారు. అందుకే షర్మిలను ప్రత్యర్థిగానే చూడాలని వైసీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఆ పార్టీ లీడర్లకు సందేశాలు కూడా వెళ్ళాయేమో. అందుకేనా మంత్రి పెద్దిరెడ్డి అలా మాట్లాడారు అన్న చర్చ నడుస్తోంది.