CM KCR: తెలంగాణలో లక్ష్మీ దేవత తాండవమాడుతోంది.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తాం: సీఎం కేసీఆర్
పల్లాను గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తాం. జనగామకు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఇస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో జనగామ పరిస్థితి దారుణంగా ఉండేది. ఉద్యమ సమయంలో నేను ఏడ్చిన ప్రదేశాల్లో బచ్చన్నపేట ఒకటి. జనగామలో అన్ని అభివృద్ధి పనులు చేపడుతా.