మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా మరో యాగం చేశారు. రెండు రోజులపాటు చేసిన ఈ యాగం లక్ష్యం ఏమిటి అన్నదే అంతు పట్టడం లేదు. కుమార్తె కవిత లిక్కర్ కేసులో ఐదున్నర నెలలు జైల్లో ఉండివచ్చాక నిర్వహించిన యాగాన్ని గతానికి భిన్నంగా ఎలాంటి హంగు లేకుండా ముగించారు.