ఐపీఎల్ 2027 సీజన్ ట్రేడింగ్లో భాగంగా హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో సంప్రదింపులు జరిపింది. అయితే ముంబై యాజమాన్యం ఆయుష్ కావాలని పట్టుబట్టడంతో, సీఎస్కే ఆ నిర్ణయం నుండి వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్లు తమకు హార్దిక్ వద్దు స్పష్టంగా చెప్పగా, కేకేఆర్ మాత్రం ముంబైతో నిరంతరం చర్చిస్తోంది. హార్దిక్ నేరుగా గుజరాత్ టైటాన్స్తో మాట్లాడినప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం హార్దిక్ను కొనుగోలు చేయవద్దని యాజమాన్యానికి గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది.