ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మార్చి నెలలో ఈ ఎన్నికలు పూర్తవుతాయి. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీలో ఉన్న బలాలను పరిశీలిస్తే.. ప్రతి 40 మంది ఎమ్మెల్యేలు ఓ ఎంపీని ఎన్నుకునే అవకాశం ఉంది.
