అంతన్నది. ఇంత అన్నది. ఇప్పుడు సడన్ గా మాయమైపోయింది. ఏపీ ఎన్నికల హీట్ తో ఊగిపోతోంది. జగన్ అభ్యర్థులందరినీ ప్రకటించేసి జనంలోకి వచ్చేసాడు. జగన్ స్పీడ్ చూస్తే ప్రత్యర్థులకి టెన్షన్ పుడుతోంది. మరోవైపు టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థుల్ని ఖరారు చేయడంలో తుది అంకానికి చేరుకున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాబలం పేరిట సభల మీద సభలు పెట్టి చెలరేగిపోతున్నారు. ఇంత హీట్ హార్ట్ సమయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హఠాత్తుగా మాయం అయ్యారు. వారం రోజుల నుంచి చెల్లెమ్మ ఎక్కడుందో కనిపించడం లేదు.
