Pervez Musharraf: మరణం తర్వాత మరణశిక్ష.. ముషారఫ్ శిక్షను సమర్ధించిన కోర్టు
పాక్ మాజీ అధ్యక్షుడు, దివంగత నేత జనరల్ పర్వేజ్ ముషారఫ్కు 2019లో విధించిన మరణదండన సరైనదే అని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇప్పుడు అభిప్రాయపడింది. అత్యంత తీవ్రస్థాయి దేశద్రోహ కేసులో.. అప్పట్లో ప్రత్యేక న్యాయస్థానం ముషారఫ్కు మరణశిక్షను ఖరారు చేసింది.