AP PENSIONS: ఇది ఎవరి పాపం? ఫించన్ కోసం వెళ్లి ఇద్దరు మృతి..
ఎట్టకేలకు ఇవాళ ఫించన్లు పంచడం ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. కానీ అదే.. ఇద్దరు వృద్ధుల పాలిట మృత్యువుగా మారింది. పింఛన్ల కోసం క్యూలో నిలబడి ఎండదెబ్బ తగలడంతో ఇద్దరు వృద్ధులు చనిపోయారు. ఉదయం నుంచి లబ్ధిదారులు సచివాలయాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు.