వర్షం అంతరాయం కలిగిస్తూ.. ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబరుస్తున్న గబ్బా టెస్టులో టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది. టెయిలెండర్లు అద్భుతంగా పోరాడడంతో తృటిలో ఫాలో ఆన్ నుంచి తప్పించుకుంది. జడేజా కీలక ఇన్నింగ్స్ కు తోడు చివర్లో బూమ్రా, ఆకాశ్ దీప్ పట్టుదలగా ఆడి ముప్పును తప్పించారు.
