మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముత్తిరెడ్డికి.. జనగామ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు BRS అధిష్టానం. ఆయన్ని బుజ్జగించడానికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చినా.. ప్రభుత్వం మారడంతో ఆ పదవీ ఊడిపోయింది. తన టిక్కెట్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. జనగామలో ప్రస్తుతం అధికారం చలాయిస్తున్నారు. ఇవన్నీ తలుచుకుంటే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కడుపు తరుక్కుపోతోంది. బీఆర్ఎస్ లో కొనసాగడం నింపుల కుంపటిలాగా ఉన్నట్టుంది.

Mutthi Reddy Yadagiri Reddy, former MLA of Janagama who is burning with anger on former CM KCR