కాంగ్రెస్ పార్లమెంటరీ (Congress Parliamentary) పార్టీ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ (Telangana) నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని … సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈమధ్యే సోనియాను కలసి విజ్ఞప్తి చేశారు. కానీ ఆమె ఆరోగ్యం, వయస్సు రీత్యా లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీకి సుముఖంగా లేరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో సోనియాగాంధీ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేస్తారని అంటున్నారు.
Sonia who does not want to come to Khammam... From Himachal to Rajya Sabha..