నెల్లూరులోని బరాషాహీద్ దర్గాకు పోటెత్తిన భక్తులు. స్వర్ణాల చెరువులో స్నానం చేసి ఒకరి రొట్టెలు మరొకరు పంచుకున్నారు. వారాంతం కావడంతో పోటిత్తిన భక్తులు. ఐదు రోజులపాటూ ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలో కులాలకు, మతాలకు అతీతంగా అందరూ పాల్గొంటారు.

నెల్లూరు జిల్లా బారాషహీద్ దర్గా లో సందడి వాతావరణం
రొట్టెల పండుగ కావడంతో అధిక సంఖ్యలో పాల్గొన్న నగరవాసులు
దర్గాలో దర్శనానికి క్యూ కట్టిన మహిళలు
స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద రోట్టెలు మార్చుకునేందుకు పోటెత్తిన భక్తులు
హిందూ, ముస్లీం తేడా లేకుండా అందరూ కలివిడిగా పాల్గొంటారు
మొహరం నుంచి ఐదురోజుల పాటూ ఈ వేడుకును నిర్వహిస్తారు
ఒకరికొకరు రొట్టెలు మార్చుకుంటున్న దృశ్యం
దర్గాలోని ఘోరీలను దర్శించుకుంటున్న భక్తులు
చెరువులోని నీటిని తీసుకొని భార్య తలపై సంప్రోక్షణ చేస్తున్న భర్త
వారాంతం కావడంతో ఇంట్లోని పిల్లలు, పెద్దలు సరదాగా ఈ కార్యక్రమంలో పాల్గొని సెల్ఫీలు తీసుకుంటున్న
మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.