జేపీ నద్దాతో తెలంగాణ బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. వీరిద్దరూ పార్టీ మారబోతున్నారు అన్న ప్రచారం నేపథ్యంలో అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుంది. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వీళ్లు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిశారు.
