Prajavani Letter: కల్తీ మద్యం కిక్కు ప్రజావాణికెక్కింది..!

సాధారణంగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ప్రజావాణి, స్పందన, మీ ఈవో ఇలాంటి రకరకాల పేర్లతో ఏర్పాటు చేస్తారు. ఇందులో బాధితులు తమ కష్ట పరిస్థితులను అధికారులకు తెలియజేసేందుకు వచ్చి ఒక అర్జీ పత్రాన్ని ఇస్తారు. తద్వారా సమస్యకు పరిష్కారం పొందుతారు. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. అయితే ఇక్కడ కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక బాధితుడు తనకు కంపెనీ మద్యం లభించడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తూ ఒక వినతి పత్రాన్ని అందజేశాడు. అదే ఇప్పుడు వింతగా మారింది. ఇలా కూడా అర్జీని పొందుపరుస్తారా అని నోరెళ్లబెట్టుకునేలా చేసింది. విషయం పైకి చూడటానికి చిన్నదిగా కనపడవచ్చు. దీని పర్యావసానం చాలా పెద్దది. కుటుంబాలకు కుటుంబాలే రోడ్డున పడే ప్రమాదం ఉంది.

Post Published By: Srikar Creator
Updated : 27 February 2023, 6:23 PM IST

Published : 
  • 27 February 2023, 6:23 PM IST

Exit mobile version