ధరణి పోర్టల్ పారదర్శకంగా ఉంటుందనీ.. రైతులకు మేలు చేస్తుందని అప్పటి సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. కానీ లక్షలమంది రైతులకు ఇది శాపంగా మారింది. యేళ్ళ తరబడి వారసత్వంగా వచ్చిన భూములు.. కొనుగోలు చేసి స్వాధీనంలో ఉన్న పట్టా భూములు కూడా పరాధీనం అయిపోవడంతో రైతన్నలు లబదిబోమన్నారు.
