అల్లు అర్జున్ పై పెట్టారు.. చంద్రబాబుపై కేసు పెట్టాల్సిందే: రోజా
చంద్రబాబు అసమర్ధ పాలనకు నిదర్శనంగా తిరుపతి ఘటన ఉందని మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. దీనికి ఎవరు బాధ్యులో తేల్చాలని ఆమె డిమాండ్ చేసారు. అసమర్థ టీటీడీ చైర్మన్, ఎస్సీ, కలెక్టర్ వలనే ఈ పరిస్థితి వచ్చిందని వీరు ఎవరికీ భక్తి లేదని ఆమె ఆరోపించారు.