కొంతకాలంగా బీజేపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీలోని చాలా మంది నేతలు తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారు. వారిలో విజయశాంతి ఒకరు. ఇటీవల జరిగిన వివిధ పార్టీ కార్యక్రమాల్లో ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. పదవుల్లో కూడా విజయశాంతి పేరు పరిగణనలోకి తీసుకోలేదు.
