కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఫాస్ట్బౌలర్లు.. రోహిత్ సేనకు చిరస్మరణీయ విజయం అందించారు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీసి శుభారంభం అందించగా.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు.
