న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా రెండో టెస్టుకు రెడీ అవుతోంది. గురువారం నుంచి పుణే వేదికగా భారత్, కివీస్ రెండో టెస్ట్ మొదలుకానుంది. సిరీస్ లో 0-1తో వెనుకబడిన రోహిత్ సేన రెండో టెస్ట్ గెలిచి సమం చేయాలని పట్టుదలగా ఉంది.