Etela Rajender: ఢిల్లీ కేంద్రంగా మంతనాలు.. హై కమాండ్ ఈటెలకు ఏం ఆఫర్ చేయబోతోంది..
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ , కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు సమాచారం. దీంతో ఈ ఇద్దరు నేతలను బీజేపీ హై కమాండ్ ఢిల్లీకి పిలిపించింది. ఇద్దరితో మంతనాలు జరుపుతోంది. ఉన్నఫలంగా ఢిల్లీకి రావాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా కబురుపెట్టింది బీజేపీ హై కమాండ్.