PV Narasimha Rao : భారత్ కీర్తిని పీవీ ప్రపంచానికి చాటి చెప్పారు : సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి వేళ హైదరాబాద్లోని ‘పీవీ జ్ఞానభూమి’ వద్ద రాష్ట్ర గవర్నర్ తమిళిసై నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, పీవీ కుటుంబ సభ్యులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేతలు పీవీకి అంజలి ఘటించారు. పీవీ నరసింహారావుకు నివాళి అర్పించిన రేవంత్ రెడ్డి. అనంతరం పీవీని గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి.