Pawan Kalyan: అమ్మవారి ఆశీర్వాదంతో ఎన్నికల ప్రయాణానికి సిద్దమైన జనసేనాని.. (ఫోటోలు)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి లోని తన పార్టీ కార్యాలయంలో చండీ యాగాన్ని నిర్వహించారు. యాగం పూర్తి చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం బలంతో వారాహి రథంపై ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ముందుగా గోదావరి జిల్లాలో యాత్ర పూర్తి చేసుకొని తరువాత రాయలసీమ జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. అన్నవరం నుంచి గన్నవరం వరకూ తొలి విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది.