E-RACE : రూ.54 కోట్లు కొట్టేశారు ! ఈ-రేస్ పెట్టకుండానే చెల్లింపులు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి నడుస్తుండగా.. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకంగా 54 కోట్ల రూపాయలను ఓ ప్రైవేట్ కంపెనీకి చెల్లించారు. HMDAలోని ఓ సీనియర్ IAS అధికారి. ఫార్ములా ఈ-రేస్ నిర్వహణకు ముందస్తుగా ఈ డబ్బులను మంత్రి, కేబినెట్, ఆర్థికశాఖ అనుమతి లేకుండానే అధికారి చెల్లించారు. ఇప్పుడు ఈరేస్ రద్దవగానే… ఆ కంపెనీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామని బెదిరించింది. దీనిపై దృష్టిపెట్టిన రేవంత్ సర్కార్ కు ఈ అడ్డగోలు చెల్లింపుల వ్యవహారం బయటపడింది.