ముగ్గురు ఐపిఎస్ లను అష్టదిగ్బంధనం చేసిన బాబు… జీవోల్లో ఏముంది…?
ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని కేసులో డీజీ హోదాలో ఉన్న పీ ఎస్ ఆర్ ఆంజనేయులుతో పాటుగా విజయవాడ మాజీ సీపీ కాంతి రానా టాటా, మాజీ డీసీపీ విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కు గల కారణాలను ప్రభుత్వం వివరిస్తూ జీవో నెంబర్లు 1590, 1591, 1592 లతో మూడు జీవోలను విడుదల చేసింది.