Kedarnath Temple: అది బంగారు తొడుగు కాదు.. ఇత్తడి.. కేదార్నాథ్ ఆలయంపై గోల్డ్ స్కాం ఆరోపణలు
ఉత్తరాఖండ్, కేదార్నాథ్ ధామ్లోని గర్భాలయంలో బంగారు తొడుగును ఏర్పాటు చేశారు. అయితే, ఆ తొడుగును కొందరు భక్తులు పరీక్షించి చూడగా.. దానిపై బంగారు పూత రాలిపోతోంది. దీంతో ఈ విషయంలో రూ.125 కోట్ల కుంభకోణం జరిగిందని ఆలయ సీనియర్ పూజారి సంతోష్ త్రివేది ఆరోపించారు.