Vijaysai lands : ఆ ముగ్గుర్నీ కలిపింది… ప్రేమ సమాజం భూములే !
వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డికి విశాఖ ఏరియాలో పార్టీని నిలబెట్టే బాధ్యతలను అప్పగించారు జగన్. అప్పటి నుంచి… అక్కడ విలువైన భూములను విజయ్ సాయి రెడ్డి, వైసీపీ నేతలు కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. అయితే విజయసాయి రెడ్డి, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, లాయర్ సుభాష్ రెడ్డి… ఈ ముగ్గురూ కలవడానికి కారణం… ప్రేమ సమాజం భూములే. ఈ భూముల వెనక పెద్ద స్కామ్ జరిగిందనీ… విచారణ జరిపించాలని విశాఖ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.