మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. మహారాష్ట్ర విజయంలో మహాయుతి చారిత్రాత్మక విజయం సాధించిందన్న ఆయన్న… నేనెప్పుడూ సామాన్యుడిగానే ఉన్నానని… సీఎంగా ఎన్నిక అవుతాను అని ఊహించలేదు అన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేసారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో షిండే, ఆయన డిప్యూటీలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లతో కలిసి గవర్నర్ను కలిసారు.