maldives

Damage to Maldives Tourism : భారత్ తో పెట్టుకుంటారా ? మాల్దీవులకు మోత మోగుతోంది

Damage to Maldives Tourism : భారత్ తో పెట్టుకుంటారా ? మాల్దీవులకు మోత మోగుతోంది

భారతీయులతో పెట్టుకున్నందుకు మాల్దీవులకు మోత మామూలుగా మోగడం లేదు. ప్రధాని మోడీతో పాటు భారతీయులను అవమానిస్తూ ఆ దేశ మంత్రులు చేసిన కామెంట్స్ ….మాల్దీవులను కోలుకోలేని తీసింది. అక్కడి టూరిస్ట్ ప్లేసుల్లోని హోటళ్ళు బుకింగ్స్ రోజుకి వేలల్లో క్యాన్సిల్ అవుతున్నాయి. రెండు రోజుల్లోనే మాల్దీవుల పర్యాటక రంగం లక్షల రూపాయలు నష్టపోయింది.  అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు, ఎంపీని మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది.  అయినా సోషల్ మీడియాలో బాయ్ కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ తో భారత్ లో మొదలైన వ్యతిరేకత విదేశాలకు కూడా పాకుతోంది.

Maldivian : అసలేంటి పంచాయితీ.. మాల్దీవ్‌ను బాయ్‌ కాట్‌ చేయాల్సిందేనా..?

Maldivian : అసలేంటి పంచాయితీ.. మాల్దీవ్‌ను బాయ్‌ కాట్‌ చేయాల్సిందేనా..?

కొంతకాలంగా వీక్‌ అవుతూ వస్తున్న భారత్, మాల్దీవుల బంధం.. ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ప్రధాని మోదీ.. లక్ష్యద్వీప్‌కు వెళ్లడం.. అక్కడ ఆయన వ్యాఖ్యలపై.. మాల్దీవుల మంత్రి కౌంటర్​ వేశారు. దీంతో కొత్త వివాదం మొదలైంది. అది కాస్త చినికిచినికి గాలివానలా తయారవుతోంది. మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయ్. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్ అంటూ నెటిజన్లు మారాయి. ఈ మధ్య ప్రధాని మోదీ.. లక్ష్యద్వీప్‌కు వెళ్లారు. అక్కడి పర్యాటక రంగాన్ని కొత్త జోష్‌ నింపేలా నాలుగు మాటాలు మాట్లాడారు. ముఖ్యంగా స్నార్కెలింగ్‌.. అంటే సముద్ర అడుగు భాగంలో ఈత కొట్టే సాహనం గురించి ప్రత్యేకంగ ప్రస్తావించారు.