SRISAILAM Mallanna: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం: ఆలయ ఈవో లవన్న
ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు శ్రీశైలమల్లన్న మహా దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సర్వం సిద్దం చేసినట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. తొలిరోజు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం సరైన ప్రణాళకతో మౌళికవసతులు అందించేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో పలు ముఖ్య విభాగాల అధికారులతోపాటూ ఇంజనీరింగ్ నిపుణులు పాల్గొన్నారు. మల్లన్న మహోత్సవం: మహాశివరాత్రి పుణ్యదినంరోజు ఆలయంలో జరిగే మహాజ్యోతిర్లింగోద్భవం, పట్లువస్తాల సమర్పణ, పాగాలంకరణ, […]