Wayanad Landslides : కేరళలో ప్రకృతి విలయతాండవం.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 93కి చేరిన మృతుల సంఖ్య!
వయనాడ్ (Wayanad) లో విలయం విషాదం నింపింది. చిన్నారులు, వృద్ధులు.. ఒకరేమిటి.. ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో అనేకమంది ఉన్నారు. నిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఘటన కావడంతో ఎవరూ ఈ ప్రమాదం నుంచి బయటపడలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 4గంటల వ్యవధిలోనే మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి.