India vs Pakistan : భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు NSG బ్లాక్ క్యాట్స్ భద్రత..
ప్రపంచకప్లో హై ఓల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఊపిరి బిగపట్టి మరీ చూసే భారత్-పాక్ మ్యాచ్ ఆ రోజున జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన గుజరాత్ అహ్మాదాబాద్లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియంపై బాంబు దాడి, రసాయన దాడులు చేస్తామన్న బెదిరింపులతో పోలీసులు కనివినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.