Operation Ajay: ఇజ్రాయెల్ యుద్ధం.. భారతీయుల్ని క్షేమంగా తెచ్చేందుకు ఆపరేషన్ అజయ్ ప్రారంభం..!
ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియా తరలించేందుకు ఆపరేషన్ అజయ్ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు. ఇజ్రాయెల్లో భారతీయులు భారీ సంఖ్యలో ఉన్నారు. దాదాపు 18,000 మంది అక్కడ ఉన్నట్లు ప్రభుత్వ అంచనా.