TTD Darshanam : తిరుమల దర్శనానికి వసూళ్ళు…. వీఐపీ సిఫార్సులతో వైసీపీ నేతల దోపిడీ !
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో శ్రీవారి దర్శనాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. స్వామి వారి దర్శనం, కల్యాణం, ప్రసాదాలకు అడ్డగోలుగా టిక్కెట్లు పెంచేశారు. అన్యమత ప్రచారం కూడా యధేచ్ఛగా జరిగింది. ఇప్పుడు కొత్తగా దర్శనాల స్కామ్ బయటపడింది.