JAGANNADH KHAJANA : వందల టన్నుల్లో వజ్ర వైఢూర్యాలు.. లక్షల కోట్ల సంపద లెక్క తేలుతుందా ?
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఖజానాలో వందల టన్నుల్లో వజ్ర వైఢూర్యాలు ఉన్నాయట. లక్షల కోట్ల విలువైన ఆ సంపదను 46 యేళ్ళ తర్వాత మళ్ళీ లెక్కించబోతున్నారు. ఆ శ్రీక్షేత్ర రత్న భాండాగారంలో లెక్కించలేనంత సంపద ఉందని అంటున్నారు. ఎంతో విలువైన ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి… రహస్య గదిలో భద్రపరిచారు పూర్వీకులు.