Lok Sabha : లోక్ సభలో దాడి చేసింది అందుకేనా..? నిజాలు బయటపెట్టిన నిందితులు
లోక్ సభలో స్మోక్ షెల్స్ విసిరి గందరగోళం సృష్టించిన కేసుపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ జరుగుతోంది. నిందితులు అసలు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డారు.. వీళ్ళ వెనక ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందా అన్న కోణంలో ఎంక్వైరీ నడుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా పార్లమెంటు ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. బాడీ స్కానర్స్ లాంటివి తెప్పిస్తున్నారు. భద్రతా ఉల్లంఘనపై 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది లోక్ సభ సెక్రటరియేట్.