chiru- charan : తండ్రిని మించిన తనయుడు
టాలీవుడ్ హీరోలకు ఈమధ్య నార్త్లో ఫాలోయింగ్ బాగా పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్చరణ్లకు అక్కడ మంచి క్రేజ్ ఉంది. రామ మందిర ప్రారంభోత్సవం రోజున అది మరోసారి ప్రూవ్ అయింది. చిరంజీవి, సురేఖ, రామ్చరణ్ రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లిన తర్వాత చిరు, చరణ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఈ వేడుకకు ఆహ్వానం అందడం గొప్ప విషయం. దీన్ని గౌరవంగా భావిస్తున్నాము. ఆ దేవుడే మాకు ఆహ్వానం అందేలా చేశాడు’ అన్నారు.