Tirupati Laddu: నందిని నెయ్యికి టీటీడీ బైబై.. ఇరవయ్యేళ్ల తర్వాత నెయ్యి కాంట్రాక్ట్ రద్దు.. లడ్డూ కోసం కొత్త నెయ్యి..!
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్), నందిని బ్రాండ్ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఇరవయ్యేళ్లుగా అందిస్తోంది. అలాంటి సంస్థతో టీటీడీ తాజాగా ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. దీంతో ఇరవయ్యేళ్లుగా సాగిన నందిని నెయ్యి సరఫరా నిలిచిపోయింది.