Delhi Railway Station: వందేభారత్ రైళ్లు సరే.. స్టేషన్లలో వసతులేవి..? ప్రయాణికుల భద్రత పట్టదా..?
మన దేశంలో రైల్వే వ్యవస్థ నిర్లక్ష్యానికి చిరునామాగా మారుతోంది. ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా కనీస వసతులు ఉండటం లేదు. రైల్వే శాఖను ఎంతగా ఆధునీకరిస్తున్నా అత్యవసర సేవలు కూడా అందుబాటులో ఉండటం లేదు. అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ ఢిల్లీలో ప్రాణాలు కోల్పోయింది.