భారత స్టార్ షట్లర్, తెలుగు అమ్మాయి పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించారు. టోక్యో వేదికగా జరిగిన జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె అద్భుత విజయాన్ని అందుకున్నారు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో 31 ఏళ్ల సింధు 21-17, 21-17 తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్, జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచిపై ఘన విజయం సాధించారు.
ఈ విజయంతో జపాన్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్న తొలి భారతీయ షట్లర్గా సింధు సరికొత్త రికార్డు నెలకొల్పారు. గత రెండేళ్లుగా సరైన ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న సింధు, 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ తర్వాత సాధించిన అతిపెద్ద విజయం ఇదే కావడం విశేషం. చివరిగా ఆమె 2024లో సయ్యద్ మోదీ అంతర్జాతీయ టోర్నీ గెలిచారు. తాజా విజయంతో తనలో ఇంకా ఛాంపియన్ ఆట మిగిలే ఉందంటూ విమర్శకులకు సింధు గట్టి సమాధానమిచ్చినట్టైంది.